ap news

ఆరుగురికి సీఎం సహాయ నిధి

పుట్టపర్తి జనవరి 12 :  రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎంఆర్ఎఫ్) ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులను అందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అనారోగ్య బాధితుల‌కు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. “ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం సంకల్పబద్ధంగా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనారోగ్య బాధితులు సహాయం పొందడంపై ప్రాధాన్యత ఇస్తూ, ఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతోమంది ప్రజలకు సాయం అందిస్తున్నాం” అని మంత్రి తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *