Prakasam

ఆక్రమణలు తొలగించకుండా ఆధునీకరణా..!?

  • పోతురాజు కాల్వ పనులు..
  • ప్రయోజనం ఉండేలా చేయాలి
  • ట్రాఫిక్ మరింత జటిలం కాకుండా చూడాలి 
కొల్లా మధు
ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు

పోతురాజు కాల్వ ఆధునికీకరణ భవిష్యత్  ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సమస్యను మరింత జటిటం చేసే అవకాశం ఉందని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఇరిగేషన్ కాల్వల మీద ఆక్రమణలు తొలగించకుండా ఆదునీకరణ చేపడితే ప్రయోజనం లేదని నిపుణులు అంటున్నారు..వీధులు,కాలనీలు వర్షాలు పడితే ముంపునకు గురయ్యే ప్రమాదముంది..పోతురాజు కాల్వ రెండు వైపులా ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణం చేపిడితేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది..దీనిపై జిల్లా కలెక్టర్ ఆలోచన చేయాలని కొల్లా మధు కోరారు.

పోతురాజు కాలువ
పోతురాజు కాలువ
ఆక్రమణలు తొలగిస్తే ప్లానింగ్ ఇలా ఉంటుంది..
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *