చంద్రబాబుపై రాళ్ల దాడి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక సభలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని ఆగంతుకులు రాళ్ళు రువ్వారు. పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావటతో ప్రమాదం తప్పింది. నిన్న సీఎం జగన్ సభలో చీకట్లో ఎవరో గులకరాయి వేస్తే, నేడు లైట్లు ఉండగానే తనపై కొందరు దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. తెనాలిలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సైతం రాళ్లు వేశారని, దీని వెనుక ఉన్నది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు.