Prakasam

ఒంగోలు ఎన్నికలకు రక్తపు మరకలు

బాలినేని, దామచర్ల వర్గీయుల ఘర్షణ
తీవ్రంగా గాయపడ్డ దామచర్ల అనుచరుడు మోహనరావు
ఒంగోలులో ఎన్నికలకు రక్తపు మరకలు అంటుకున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి (వైసీపీ), దాచమర్ల జనార్దన్ (టీడీపీ) మధ్య నడుస్తున్న ఎలక్షన్ వార్ లో రెండు పార్టీల కార్యకర్తలు, ఆయా నేతల అనుచరులు పరస్పరం కాలు దువ్వుకుంటున్నారు. దేనికైనా సిద్ధమేనంటూ తొడలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు సమతా నగర్ లో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న పరస్పర దాడుల్లో దామచర్ల జనార్దన్ అనుచరుడు ఎం.మోహనరావుకు తీవ్ర గాయాలయ్యాయి. విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో అతని శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. రక్తం కారుతుండగా అలాగే కూర్చుని ఉన్న దామచర్ల అనుచరుడిని మనం ఫొటోలో చూడవచ్చు. పోలీస్ అధికారులు తక్షణం కల్పించుకుని రెండు వర్గాలను అదుపులో పెట్టకపోతే ఎన్నికలు మరింత ఉద్రిక్తతగా మారి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *