టీడీపీలో చేరిన కోలా ప్రభాకర్
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్ తెలుగుదేశంలో చేరారు. ఒంగోలు లోని కాపు కల్యాణ మండపం లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్, లోక్ సభ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జడా బాలనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.