వైసీపీ ఆరో జాబితా విడుదల
మార్కాపురానికి అన్నా రాంబాబు
గిద్దలూరుకు కందుల నాగార్జున రెడ్డి
గుంటూరు ఎంపీ స్థానానికి ఉమారెడ్డి వెంకటరమణ
అధికార పార్టీ మరికొందరు సమన్వయకర్తలను ప్రకటించింది. ఇప్పటికే అయిదు జాబితాలను ప్రకటించిన పార్టీ శుక్రవారం రాత్రి ఆరో జాబితాను విడుదల చేశారు. మంత్రి మేరుగ నాగార్జున వారి పేర్లను ప్రకటించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమన్వయకర్తగా కందుల నాగార్జునరెడ్డి, మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు పేర్లను ప్రకటించారు. ప్రస్తుతం అన్నా రాంబాబు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉండగా నాగార్జునరెడ్డి మార్కాపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గుంటూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమారెడ్డి వెంకటరమణను నియమించారు. మొత్తం నాలుగు ఎంపీ స్థానాలకూ, ఆరు ఎమ్మెల్యే స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ ఆరో జాబితా విడుదల చేశారు.
ఎంపీ స్థానాల సమన్వయకర్తలు
గుంటూరు.. ఉమారెడ్డి వెంకట రమణ
నర్సాపురం.. న్యాయవాది ఊమాబాల
రాజమండ్రీ.. గూడూరి శ్రీనివాస్
చిత్తూరు.. ఎన్ రెడ్డప్ప
ఎమ్మెల్యే అభ్యర్దులు
మైలవరం… తిరుపతి యాదవ్
మార్కాపురం.. అన్నా రాంబాబు
గిద్దలూరు.. కందుల నాగార్జున రెడ్డి
నెల్లూరు.. ఎండీ ఖలీల్
గంగాధర నెల్లూరు.. నారాయణ స్వామి
ఎమ్మిగనూరు.. బుట్టా రేణుక
![](https://andhravani.net/wp-content/uploads/2024/02/Khaleel-ahmad-300x206.jpg)