ap news

రామోజీకి నరసం ఘన నివాళి

రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

తెలుగు భాషకు ఆయన సేవలు అజరామరం
మీడియా మొఘల్, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత, పద్మభూషణ్ రామోజీరావు మృతి పట్ల నవ్యాంధ్ర రచయిత సంఘం (నరసం) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఒంగోలు హౌసింగ్ బోర్డులోని నరసం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించింది. ఈ సందర్బంగా నరసం గౌరవాధ్యక్షురాలు టి.అరుణ మాట్లాడుతూ తెలుగు జర్నలిజానికీ, తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అజరామరంగా నిలిచిపోతాయన్నారు. వసుంధర ద్వారా వేలమంది మహిళా ప్రతిభా మూర్తులను సమాజానికి పరిచయం చేశారని కొనియాడారు. ఉన్నత వ్యక్తిత్వం, విలువలు, పట్టుదల, దీక్షతో అన్ని రంగాల్లోనూ ఘన విజయం సాధించిన రామోజీరావు ఈ తరానికి స్ఫూర్తిదాయకమనీ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. విలువలే పెట్టుబడిగా ఆయన అన్ని రంగాల్లో విజయం సాధించి మార్గదర్శిగా నిలిచారని నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు కొనియాడారు. రామోజీకి నివాళులు అర్పించిన వారిలో నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, డాక్టర్ నూనె అంకమ్మ రావుగారు, కుర్రా ప్రసాద్ బాబు, మారేపల్లి సూర్య కుమారి, నెమ్మాని సీతారామ మూర్తి, యు.వి రత్నం, బీరం అరుణ, కె.శాంతిలత, మహిళాభ్యుదయ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *