Prakasam

టీడీపీలోకి కోలా ప్రభాకర్

వైసైపీని వీడేందుకు నిర్ణయం
ఈనెల 19న మాగుంట, దామచర్ల సమక్షంలో చేరిక
వైఎస్ఆర్సీపీపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్ ఆ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఒంగోలుకు చెందిన ఆయన ఈనెల 19న టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. ఒంగోలు లోక్ సభ, అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధులు మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ సమక్షంలో 19న కాపు కళ్యాణ మండపంలో తన అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరనున్నారు. తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు,నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరారు.

దామచర్ల తో కోలా ప్రభాకర్ భేటీ అయిన దృశ్యం

దామచర్ల తో భేటీ

పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒంగోలు టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ తో కోలా ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ఒంగోలులోని తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరూ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కోలా ప్రభాకర్ మాట్లాడుతూ..
రాష్ట్ర అభివృద్ధి కోసం అనుభవజ్ఞులైన  నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో భారీ సంఖ్యలో తన అనుచరులతో చేరేందుకు నిశ్చయించుకున్నామని తెలిపారు. ఈనెల 19న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒంగోలులోని కళ్యాణ మండపంలో తమ అనుచరులతో భారీ ఎత్తున మాగుంట, జనార్దన్ ల సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.  రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా క్రృషి చేస్తామని తెలిపారు.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *