దామచర్లను కలిసిన దమ్మాలపాటి
ఒంగోలుకు చెందిన యువనాయకుడు దమ్మాలపాటి రమేష్ త్వరలో తెలుగుదేశంలో చేరనున్నారు. మొదటి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరునిగా ఉన్న రమేష్ ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యర్శిగా పనిచేశారు. తాజాగా ఒంగోలు టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ను కలిశారు. రమేష్ తోపాటు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ (ఏపీ) సోమిశెట్టి సుబ్బారావు గుప్తా, రాష్ట్ర కాపు నాయకుడు చెన్నం శెట్టి రాంబాబు , రాష్ట్ర వైశ్య నాయకుడు పువ్వాడ సుబ్బయ్య, మైనార్టీ నాయకుడు షేక్ శ్రీనివాసరావు తదితరులు కూడా కూడా దామచర్లను కలిసిన వారిలో ఉన్నారు. త్వరలో వీరంతా అధికారికంగా జనార్దన్ సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు.