Prakasam

ఎన్నికల నిఘా పరిశీలకునిగా చక్రపాణి

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి,ఎన్నికలలో అక్రమాలను నివారించడానికి, మద్యం డబ్బులు లాంటి ప్రలోభాలను తగ్గించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను 13 ఉమ్మడి జిల్లాలకు నియమించడం జరిగింది.ప్రకాశం జిల్లాకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి ఈనెల 4,5,6,7 తేదీల్లోఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల హోటల్ మౌర్య ఇన్ లో అందుబాటులో ఉంటారు.ఎన్నికల అక్రమాలను ఎవరైనా డి.చక్రపాణి ఐఏఎస్ రిటైర్డ్ దృష్టికి తీసుకొని రాద లచినవారు 9010204300 నెంబర్ సంప్రదించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.ఎన్నికల నిఘా వేదిక మరియు పౌర సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఎన్నికల అక్రమాలను డి.చక్రపాణి ఐఏఎస్ రిటైర్డ్ దృష్టికి తీసుకొని వెళితే వారు సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి కృషి చేస్తారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లoరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *