ap news

నరసరాపేటలో టిడిపి నిరసన ప్రదర్శన

కదలి వచ్చిన జిల్లా నేతలు
డాక్టర్ అరవింద్ బాబుకు పరామర్శ

నరసరావుపేట టిడిపి ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుపై పోలీసులు దాడి చేసి అతను ఆస్ప్రతిపాలయ్యేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆ పార్టీనేతలు ఆదివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ బాబును పరామర్శించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందనీ..ప్రశ్నించే వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతోందని ఈసందర్భంగా నేతలు అన్నారు.

పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

నిరసన ర్యాలీలో పాల్గొన్న వారిలో మాజీ మంత్రులు జవహర్, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు జి.వి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్ రావు, తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టార్, నల్లపాటి రాము, అశోక్ బాబు, పిల్లి మాణిక్య రావు, బుచ్చి రాం ప్రసాద్, డూండి రాకేష్, దారపనేని నరేంద్ర తదితరులు ఉన్నారు.

ఆసుపత్రిలో డాక్టర్ అరవింద్ బాబు పరామర్శిస్తున్న నేతలు
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *