ap news

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్, ఇళయరాజా

ప్రముఖ కధా రచయిత కె.వి విజయేంద్రప్రసాద్ ను రాజ్యసభ పదవి వరించింది. రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేయగా వారిలో విజయేంద్రప్రసాద్ ఒకరు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రయిన విజయేంద్రప్రసాద్ బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాల కథా రచయితగా దేశవ్యాప్తంగా పేరు పొందారు. విజయేంద్రప్రసాద్ తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ సామాజిక వేత్త వీరేంద్ర హెగ్డే, పరుగుల రాణి పి.టి ఉషను కేంద్ర రాజ్యసభకు నామినేట్ చేసింది. వీరిని అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *