ap news

రాష్ట్రానికి త్వరలో మంచిరోజులు

ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో పవన్
రాష్ట్రానికి త్వరలో మంచిరోజులు రాబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ళ తర్వాత మోదీని కలవడం ఇదే తొలిసారి..మోదీతో నా సమావేశం రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తుంది..త్వరలోనే మంచిరోజులు రానున్నాయి..రాష్ట్రం బాగుండాలనేదే ప్రధాని మోదీ ఆకాంక్ష..ప్రత్యేక పరిస్థితుల మధ్య ఇద్దరం సమావేశం కావాల్సి వచ్చింది..తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలనేది మోదీ ఆకాంక్ష..ప్రధాని మోడీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు..మా సమావేశంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాని పవన్ తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *