సీఎం జగన్ తో కంది సాయినాధ్ భేటీ
ఒంగోలుకు చెందిన యువ పారిశ్రామికవేత్త, రవి శంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ తనయుడు కంది సాయినాధ్ మంగళవారం సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తగా వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్న కంది సాయినాధ్ ను సీఎం అభినందించారు.