Prakasam

సుజాతనగర్ లో బాలగణేషుని ఉత్సవాలు

ఒంగోలు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. సుజాత నగర్ 8వ లైను మధ్యలో ఈనెల 3న శనివారం రాత్రి బాల గణేషుని ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులకూ, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈనెల 4న ఆదివారం నిర్వహించే నిమజ్జనం కార్యక్రమంలోనూ సుజాతనగర్ లోని 8వ లైను నివాసితులంతా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

వైభవంగా నిమజ్జన వేడుకలు 

సుజాతనగర్ 8 వ లైనులో బాలగణేషుని నిమజ్జన వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. చిన్నారులు ఆట పాటలతో అలరించారు. కోలాటం, భక్తి గీతాలతో సందడి నెలకొంది.  మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగులు చల్లుకున్నారు. గణేష్ మహరాజ్ కీ జై అంటూ భక్తి శద్ధలతో బాలగణేషుని ఊరేగించి నిమజ్జనం చేశారు.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *