సీఎం జగన్ తో కంది రవిశంకర్ బేటీ
ప్రముఖ వ్యాపారవేత్త, రవిశంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రవిశంకర్ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రవిశంకర్ జగన్ కు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్టు రవిశంకర్ ఆంధ్రావని ప్రతినిధికి తెలిపారు.