టీడీపీలో చేరిన సుబ్బారావు గుప్తా
![](https://andhravani.net/wp-content/uploads/2024/05/gupta-300x200.jpg)
ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ విభాగం రాష్ట్ర ఛైర్మన్ సుబ్బారావు గుప్తా టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఒంగోలులో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. గతంలో వైఎస్ఆర్ సీపీలో ఉన్న గుప్తా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంలో ఆయన అనుచరులైన సుభానీ, తదితరులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. లాడ్జి గదిలో తీవ్రంగా అవమానిస్తూ కొడుతూ వీడియో తీశారు. అప్పట్లో ఆ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అప్పటి నుంచి గుప్తా ఒంగోలులో బాలినేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు సమక్షంలో నారా లోకేష్ ఒంగోలుకు వచ్చిన సందర్భంగా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సందర్భంగా లోకేష్ కు 1,16,000 రూపాయలను పార్టీ ఫండ్ కింద గుప్తా అందించారు.
![](https://andhravani.net/wp-content/uploads/2024/05/singaraju-300x186.jpg)
శింగరాజు రాంబాబు చేరిక
మరో వైపు ఒంగోలులో నగరంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శింగరాజు రాంబాబు తెలుగుదేశంలో చేరారు. నారా లోకేష్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఒంగోలు నగరంలో బాలినేనికి ప్రధాన అనుచరునిగా ఉన్న రాంబాబు కొంతకాలంలో రాజకీయంగా మౌనం దాల్చారు. బాలినేనితో వచ్చిన తీవ్ర విబేధాల వల్లనే ఆయనిపుడు పచ్చ కండువా కప్పుకున్నట్టు సమాచారం. 2014లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాంబాబు 2019 ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి చేరారు. మళ్ళీ ఇపుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.