ap news

సీఎంతో మేకపాటి భేటీ

సీఎం జగన్ కు పుష్ఫగుచ్ఛం అందిస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డి, పక్కన మేకపాటి రాజమోహన్ రెడ్డి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిసిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆయన తనయుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి.  మాజీ మంత్రి గౌతంరెడ్డి మృతిచెందటంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు స్థానం నుంచి ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని పోటీ చేయించేందుకు మేకపాటి కుటుంబం నిర్ణయించింది. ఈ మేరకు సీఎంతో మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు విక్రమ్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టిడిపి, జనసేన పోటీ చేసే అవకాశం లేకపోయినా బీజేపీ మాత్రం అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *