ap news

మునుగోడు నుంచి గద్దర్ పోటీ

ప్రకటించిన ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ 

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరుపున ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు.  పోటీ చేసే విషయమై గద్దర్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. “భారత రాజ్యాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం నోటు తీసుకోని ఓటు వేయడం నేరం. అందరికి అదే చెబుతున్నా నోటు తీసుకోకుండా మీకు నచ్చిన వారికి ఓటు వేయండి’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్టు గద్దర్ ప్రకటించారు. దీనిపై మరింత స్ఫష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి గద్దర్, కేఏపాల్ కలిసి ఉన్న ఫొటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *