ap news

రాష్ట్రంలో ఇథియోపియా బృందం పర్యటన

  • సీఎం జగన్ తో భేటీ
  •  గన్నవరంలో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌ను సందర్శన
  • గండిగుంటలో ఆర్బీకే –2 కేంద్రాన్ని సందర్శన
  • రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇథియోపియా బృందం

ఇథియోపియా బృందం ఏమందంటే…
Dr. MELES MEKONEN YIMER, ఇథియోపియా వ్యవసాయశాఖమంత్రి.
రాష్ట్రంలో ఆర్బీకేల వ్యవస్థ మమ్మల్ని చాలా ఉత్సాహ పరిచింది:
ముఖ్యమంత్రిగారి దార్శనికత కనిపిస్తోంది:
ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి:
ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది:
ఆర్బీకేల వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది ఉంది:
ఆర్బీకేల్లో వ్యవసాయరంగంలో వివిధ విభాగాల అనుసంధానం బాగుంది:
డిజటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు:
వ్యవసాయరంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం వినియోగించుకుంటాం:
అలాగే మాకున్న పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను మీతో పంచుకుంటాం:
వ్యవసాయరంగంలో రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పంం క్షేత్రస్థాయిలో మంచి మార్పులకు దారితీయడం మమ్మల్ని అబ్బురపరుస్తోంది:

Dr.MANDEFRO NIGUSSIA, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఏజెన్సీ ఆఫ్‌ ఇథియోపియా.

రైతుకు అండగా నిలవకపోతే ఏం అవుతుందో ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు: ముఖ్యమంత్రితో అన్న Dr. MANDEFRO NIGUSSIA

ఈ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోంది: Dr.MANDEFRO NIGUSSIA

ఆర్బీకేల వ్యవస్థ.. చిట్టచివరి స్థాయి వరకూ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తోంది:
అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకునేలా వ్యవసాయరంగాన్ని ఈవ్యవస్థ తీర్చిదిద్దుతోంది:
వ్యవసాయరంగంలో అన్ని విభాగాల కార్యకలాపాలను సమీకృతం చేయడం మరొక మంచి పరిణామం:
రైతుల సందేహాలు, సమస్యలు.. తదితర అంశాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఒన్‌స్టాప్‌ పద్ధతిలో పరిష్కారాలు సూచించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతోంది:
ఇతరులకూ కూడా ఈ వ్యవస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది:
రైతుల అవసరాలను గ్రామస్థాయిలోనే తీరుస్తున్నారు:
ఈ విధానాన్ని మేం కూడా అనుసరిస్తాం:
పశువులకోసం మొబైల్‌అంబులెన్లు ఏర్పాటు కూడా బాగుంది:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి జ్ఞాపిక ను అందుకుంటున్న ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి డాక్టర్ మాండెఫ్రో నిగుస్సియా

తర్వాత ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ…:
మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కొనసాగుతుంది:
ఏ రూపంలో కావాలన్నా మేం తోడుగా ఉంటాం:
అలాగే మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం:
ఆర్బీకేలను సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడ్డం సంతోషకరం:
ప్రతి గ్రామానికీ కూడా వ్యవసాయరంగంలో ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు చేరుకోవాలన్నది లక్ష్యం, దీంట్లో భాగంగానే ఆర్బీకేలు వచ్చాయి:
కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, ఎరువుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఉన్నాయి:
ఈ సమస్యకు పరిష్కారంకోసం మార్గాన్వేషణ చేశాం:
అదే సమయంలో రైతుకు సరైన మార్గనిర్దేశం, అవగాహన కల్పించాలన్నది ఉద్దేశం:
పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు:
ఇవన్నీకూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు:
వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాం:
అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం:
ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితేం అర్హులందరికీ అది అందాలి:
ఈ ఆలోచనల క్రమంలోనే ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది:
గ్రామ సచివాలయానికి విస్తరణగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం:
అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకేలో పెట్టాం:
ఆక్వా ప్రాంతాల్లో ఆరంగంలో గ్రాడ్యుయేట్‌ను, హార్టికల్చర్‌ సంబంధిత గ్రాడ్యుయేడ్‌ను ఆర్బీకేల్లో ఉద్యోగాల్లో ఉంచాం:
ఆర్బీకేల్లో కియోస్క్‌ను కూడా పెట్టాం:
ఆర్డర్‌ ఇచ్చిన వాటిని రైతుల దగ్గరకే చేరుస్తున్నాం:

తద్వారా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నివారిస్తున్నాం:
ఆర్బీకేల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటుచేశాం:
ఇ–క్రాపింగ్‌ కూడా చేస్తున్నాం:
జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నాం:
ఇ– క్రాపింగ్‌ను రైతులు కూడా ఆధీకృతం చేస్తున్నారు:
ఫిజికల్‌ రశీదు, డిజిటల్‌ రశీదును కూడా ఇస్తున్నాం:
పంటలకు వచ్చే ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎంయాప్‌ను కూడా వినియోగిస్తున్నాం:
ఎక్కడైనా ధరలు తగ్గితే అలర్ట్‌ వస్తున్నాయి:
ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకుని రైతులకు నష్టంరాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం:
రైతులకు కనీస మద్దతు ధరలు అందిస్తున్నాం:
ప్రతిరోజూకూడా విలేజ్‌అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల నుంచి పంటల ధరలపై నివేదికలు తీసుకుంటున్నాం:
వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఈ విధానాలను అనుసరిస్తున్నాం:
అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీకూడా సాకారమవుతున్నాయి:
వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమకు తోడ్పాటు ఇవ్వడంద్వారా రైతులకు అదనపు ఆదాయాలు వచ్చేలా కృషిచేస్తున్నాం:
జీవనోపాథికోసం పట్టణాలకు వచ్చే వలసలను నివారించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నాం:
విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వాడకుండా నివారించాలన్నది మరో లక్ష్యం:
దీనికోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం:
సాయిల్‌ టెస్ట్‌ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలువేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్నదానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం:
ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్‌ నుంచి అమల్లోకి తీసుకు వస్తాం:

ఆర్బీకేల్లో డిజిటల్‌ సొల్యూషన్స్‌ విషయంలో
తమకు సహకారాన్ని అందించాల్సిందిగా కోరిన ఇథియోపియా బృందం
కచ్చితంగా సహకారం అందిస్తామని వెల్లడించిన సీఎం.

ఈ భేటీలో ఇథియోపియా బృందంతో పాటు వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఏపీస్టేట్‌ సీడ్స్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ జి శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *