ap news

సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న రాజధాని మహిళా రైతులు

అసరవల్లి సూర్యనారాయణస్వామిని అమరావతి ప్రాంత రైతులు దర్శించుకున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు. ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం రథాన్ని శ్రీకాకుళం తీసుకొచ్చిన రైతులు శనివారం ఆదిత్యుని ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *