ap news

వైసీపీలో చేరిన బొమ్మిరెడ్డి

సీఎం సమక్షంలో చేరిక
నెల్లూరు జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి శుక్రవారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. వెలగపూడిలోని సీఎం క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన వారిలో బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *