ap news

కుంభకోణాల మంత్రి కాకాని…

సోమిరెడ్డి తీవ్ర విమర్శ

తోటపల్లి గూడూరు మండలం విలికానిపల్లి పంచాయతీలో పర్యటన

సర్వేపల్లి నియోజకవర్గంలోకుంభకోణాలకు కేరాఫ్ మంత్రి కాకాని అని.. నియోజకవర్గాన్ని దోచుకోవటంలో అడ్డే లేకుండా పోయిందని మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా మండలంలోని వీలుకానిపల్లి పంచాయతీలో ఆదివారం బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ నిర్వహించారు.వీలుకానిపల్లి సర్పంచ్ గోపిరెడ్డి పావని అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణాలు జరుగుతున్నాయని సంపాదనే ధ్యేయంగా మంత్రి కాకాని దోచుకుంటున్నాడని తెలిపారు.రాష్ట్రంలోనే కుంభకోణాల మంత్రిగా కాకాణి పేరుపడ్డాడని, ఎద్దేవా చేశాడు.తుఫాన్ వల్ల నష్టపోయిన వారిలో తమ అనుకూలమైన వారికి 2500 ఇచ్చారని, అదే తెదేపా ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు,20 కేజీల బియ్యం పంపిణీ చేశామని చెప్పారు .మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం తాగి పేద ప్రజలు చనిపోతున్న ఈ ప్రభుత్వానికి ఇంకితజ్ఞానం లేదన్నారు.ఏ గ్రామంలో చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలోని అభివృద్ధి సాధించామని మంత్రి కాకాని వరగబెట్టింది ఏం లేదన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసిపి సింగల్ నెంబర్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నారు.సంక్షోభంలో ఆక్వా రంగం ఉందనిసోమిరెడ్డి విమర్శించారు..వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి విద్యుత్తు చార్జీలు చెల్లించలేక ఆక్వా రంగం సంక్షోభంలో పడిందని, అధికారంలోకి రాక మునుపు ఎన్నికల వాగ్దానాలలో ఆక్వా రైతులకు ఒకటిన్నర రూపాయికి ఇస్తానన్న విద్యుత్తు ఒక యూనిట్ కి 6 రూపాయలు ఈ ప్రభుత్వం గుంజుతుందన్నారు.దీంతో ఆక్వా రైతులు సాగు చేయలేక అప్పుల ఊబిలో కూరుక పోయారన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆక్వా రంగానికి 1.50 రూపాయలకు యూనిట్ ఇస్తామని సోమిరెడ్డి తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *