ap news

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు

ఈ నెల 17వ తేదీన బిగ్‌బాస్‌ సీజన్‌–7 ఫైనల్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో బిగ్‌బాస్‌ యాజమాన్యం ఎండమోల్‌షైన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు తాజాగా నోటీసులు జారీచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన బిగ్‌బాస్‌ ఫైనల్‌ వేడుకలో పల్లవిప్రశాంత్‌ విజేతగా నిలిచారు. అయితే అప్పటికే పల్లవిప్రశాంత్‌, రన్నరప్‌ అమర్‌దీప్‌ చౌదరి అభిమానులు భారీసంఖ్యలో అక్కడికి చేరుకొని ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అమర్‌దీప్‌, మరో కంటెస్టెంట్‌ గీతూరాయ్‌, పోలీసుల కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పల్లవిప్రశాంత్‌తోపాటు మరికొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బిగ్‌బాస్‌ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు అందజేశారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *