ap news

శిద్ధా సుధీర్ కు నేషనల్ అవార్డ్

అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు ప్రదానం

ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు సభ్యుడు శిద్దా సుధీర్  కు జూనియర్ చాంబర్ ఆఫ్ ఇండియా అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసింది. బెంగుళూరులో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ నాట్ కాన్ 2023లో అవార్డును అందించారు. జూనియర్ చాంబర్ ఇండియా జాతీయ ప్రెసిడెంట్ జె.ఎఫ్.ఎస్.కార్తికేయ చేతుల మీదుగా సుధీర్ అవార్డును అందుకున్నారు. అవార్డు ప్రదాన వేడుకల్లో కర్ణాటక లేబర్ మినిస్టర్ సంతోష్ జీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె.సి.ఐ ప్రతినిధులు మాట్లాడుతూ యువ పారిశ్రామిక వేత్తగా ఉత్తమ విజయాలు సాధించి సేవా రంగంలో విశేష సేవలు అందించి ఎంతో మందికి ఉపాధి కల్పించటం ద్వారా పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శిద్దా సుధీర్ ను అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. అనంతరం శిద్దా సుధీర్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. జె.సి.ఐ అమలు చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు చేయుతను అందించేందుకు తప్పక కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జె. సి.ఐ ప్రతినిధులు శిద్దా సుధీర్ కుమార్ కు శాలువాతో సత్కరించి మెమోంటో అందచేశారు.ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ జె..ఎఫ్.ఎస్ కార్తికేయన్, ఐ. ఎమ్.ఎమ్.పాస్ట్ ప్రెసిడెంట్ జె.ఎఫ్.ఎస్.అంషూ షరాఫ్, ఎస్.ఎమ్.ఏ.నేషనల్ అడ్వైజర్ జె.ఎఫ్.ఎస్ రాఖీ జైన్, పాస్ట్ నేషనల్ చైర్మన్ జె.ఎఫ్. ఎస్ సంజయ్ మన్కడ్, ఎస్.ఎమ్.ఏ.నేషనల్ చైర్మన్ జె.ఎఫ్.జి.ప్రమోద్ కుమార్, ఎస్.ఎమ్.ఏ నేషనల్ వైస్ చైర్మన్ ఏరియా-ఏ .జె.ఎఫ్. ఎస్ అంబూ, ఒంగోలు పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ జె.సి.ఐ స్థాయి సౌత్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

అవార్డుతో శిద్ధా సుధీర్

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *