ap news

విజయవాడలో దళిత స్త్రీ శక్తి 18వ వార్షిక సమ్మేళనం

దళిత ఆదివాసీ మహిళలు – సామాజిక న్యాయంపై సదస్సు

విజయవాడలోని అంబేద్కర్ భవన్ లో ఈనెల 8 గురువారం ఉదయం 10 గంటలకు దళిత స్త్రీ శక్తి 18వ రాష్ట్ర వార్షిక సదస్సు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. ఈమేరకు ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దళిత ఆదివాసీ మహిళలు – సామాజిక న్యాయంపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్యదర్శి హర్షవర్దన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మచిలీపట్నం పోర్ట్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దయాసాగర్ తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *