విజయవాడలో దళిత స్త్రీ శక్తి 18వ వార్షిక సమ్మేళనం
దళిత ఆదివాసీ మహిళలు – సామాజిక న్యాయంపై సదస్సు
విజయవాడలోని అంబేద్కర్ భవన్ లో ఈనెల 8 గురువారం ఉదయం 10 గంటలకు దళిత స్త్రీ శక్తి 18వ రాష్ట్ర వార్షిక సదస్సు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. ఈమేరకు ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దళిత ఆదివాసీ మహిళలు – సామాజిక న్యాయంపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్యదర్శి హర్షవర్దన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మచిలీపట్నం పోర్ట్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దయాసాగర్ తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు.