Literature

సముద్రాల శ్రీదేవి పుస్తకాల ఆవిష్కరణ

తెలుగు బుక్ ఆప్ రికార్డ్ సర్టిఫికెట్ స్వీకరణ

గజల్స్ సీడీ, సముద్రాల ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ 

ప్రముఖ కవులు, కళాకారులకు సన్మానం

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ప్రముఖ రచయిత్రి సముద్రాల శ్రీదేవి రచించిన 16 పుస్తకాలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె రాసిన 12 గజల్స్ సీడీతో పాటు సముద్రాల ఫౌండేషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆప్ రికార్డ్ సర్టిఫికెట్ సముద్రాల శ్రీదేవి అందుకున్నారు. జాతీయస్థాయిలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కవులు, కళాకారులను సభలో సన్మానించారు. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్,తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాలేశ్వరం శంకరం, సముద్రాల వేణుగోపాలాచారి, జడ్జి చంద్రయ్య ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్,నేటి నిజం ఎడిటర్ భైస దేవదాస్ ,కళారత్న బిక్కి కృష్ణ తదితర సాహితీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గజల్స్ సీడీని ఆవిష్కరిస్తున్న దృశ్యం
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *