Prakasam

సీఎం జగన్ తో శిద్ధా భేటీ

సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంగా పుష్ఫగుచ్ఛం అందిస్తున్న శిద్ధా రాఘవరావు, ఆయన తనయుడు శిద్ధా సుధీర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా సుధీర్ లు కలిశారు. అమరావతి సచివాలయంలోని సీఎం కార్యాలయంలో వారిద్దరూ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో రాజకీయాలు, శిద్దా నిర్వహించాల్సిన పాత్రపై చర్చకు వచ్చినట్టు సమాచారం. శిద్దా సేవలను వినియోగించుకునే విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *