Prakasam

టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య

ఉలిక్కిపడ్డ ఒంగోలు
హత్యను ఖండించిన సీఎం చంద్రబాబు

ఒంగోలు నగరం ఉలిక్కిపడింది..నాగులుప్పలపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని పద్మ టవర్స్ లోని అతని ఆఫీసులో హంతకులు జొరబడి వీరయ్యను దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న వీరయ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వీరయ్యను అతి కిరాతకంగా చంపినట్టు అతని శరీరంపై ఉన్న గాయాలను చూస్తే తెలుస్తోంది. వీరయ్యను ఎవరు చెప్పారు..ఎందుకు చంపారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ హత్యను చేధించి హంతకులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వీరయ్యకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాగులుప్పలపాడు ఎంపీపీగా గతంలో పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల లోక్ సభ నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు వీరయ్య దగ్గర బంధువు. నాగులుప్పలపాడు రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా ఉండే వీరయ్యను ఎవరు చంపారు..చంపాల్సినంత కక్షలు ఎవరికున్నాయి అనే  విషయం చర్చనీయాంశంగా మారింది.

లోకేష్ తో వీరయ్య (ఫైల్ ఫొటో)

హత్యను ఖండించిన సీఎం చంద్రబాబు
సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో వీరయ్య చౌదరి ఎంతో చురుగ్గా ఉండేవారు..అలాంటి నేతను కోల్పోవడం విచారకరం అన్నారు. ఘటనపై జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో సిఎం మాట్లాడారు. పోలీసు అధికారులతోనూ మాట్లాడిన సిఎం….నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటామని సిఎం అన్నారు.

నేడు ఒంగోలుకు హోం మంత్రి  అనిత 

దారుణ హత్యకు గురయిన టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులు అర్పించేందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత బుధవారం ఒంగోలు రానున్నారు. వీరయ్య హత్యపై ఇప్పటికే ఆమె పోలీస్ అధికారులతో మాట్లాడారు. హంతకులను వీలైనంత తొందరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *