ap news

ఏపీలో మరో రాజకీయపార్టీ

జై భారత్ నేషనల్ పార్టీ ఆవిర్భావం

పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీకి జై భారత్ నేషనల్ పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాకు వివరాలు అందించారు. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తాం..నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది..వీళ్లు వారు తిన్నారు అంటున్నారు..వాళ్లు వీరు కూడా తిన్నారు అంటున్నారు…అవినీతిని అంతమొందించేందుకే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ…బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలే నేర్పిస్తుంది..ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి..ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ..కుంటుంబపాలన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి..మేం తప్పు చేయం.. అప్పు చేయం..చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికి వచ్చిందే జైభారత్ నేషనల్ పార్టీ అని వ్యాఖ్యానించారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *