gunturu

టీడీపీలోకి ఆర్కే అనుచరుడు

వేణుగోపాల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న లోకేష్

వేణుగోపాల్ రెడ్డికి టీడీపీ కండువా కప్పిన లోకేశ్

టీడీపీ ఆఫీసు నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ

వైసీపీలో ఆత్మగౌరవం లేకే చాపార్టీని వీడి బయటికి వస్తున్నారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు గొర్లె వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేణు గోపాల్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తాడేపల్లి వరకు పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు తాడేపల్లి‌లో టపాకాయలు పేల్చారు. జై లోకేష్.. జై టీడీపీ అంటూ తాడేపల్లి సీఎం నివాసం సమీపంలో నినాదాలు చేశారు. వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరడంపై లోకేశ్ స్పందిస్తూ వైసీపీలో ఆత్మగౌరవం లేకే చాలామంది పార్టీని వీడి బయటికి వస్తున్నారని వెల్లడించారు. గంజాయి మత్తులో తాడేపల్లి మండలం మొత్తం నాశనమైందని విమర్శించారు. నరేంద్ర మోడీ సభలో ఏపీకి కావాల్సిన ఒక్క అంశాన్ని కూడా జగన్ అడగలేదని లోకేశ్ ఆరోపించారు.

మాట్లాడుతున్న లోకేష్
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *