మాగుంటతో కంది రవిశంకర్ భేటీ
28న చదలవాడకు రావాలని ఆహ్వానం
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రముఖ వ్యాపారవేత్త, రవిప్రియ మాల్ అధినేత, జనసేన నాయకుడు కంది రవిశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 28న చదలవాడలో రాడిసన్ గ్రూప్ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫైవ్ స్టార్ హోటల్ శంఖుస్థాపనా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందించారు.

