వివాహ రిసెప్షన్ కు సీఎం జగన్
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కావలి మండలం గౌరవరం వద్ద ఉణ్న రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు హాజరయిన ఆయన వధూ వరులు బాల సాకేత్ రెడ్డి, మహిమలను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. ఈ వివాహ రిసెప్షన్ రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.