Prakasam

జనసేనలో కంది రవిశంకర్.. పార్టీలో జోష్

జనసేనలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తో కంది రవిశంకర్ ఆత్మీయ కరచాలనం

ఒంగోలు నగరంలో పండుగ వాతావరణ
క్రియాశీలక రాజకీయాల్లోకి తొలి అడుగులు
త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు
ప్రకాశం జిల్లా జనసేనలో జోష్ నిండింది. ప్రముఖ వ్యాపారవేత్త, రవిశంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రవిశంకర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. రవిశంకర్ ను పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. రవిశంకర్ తో పాటు ఆయన వియ్యంకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య కూడా పార్టీలో చేరారు.
ఒంగోలులో పండుగ వాతావరణం
జనసేనలో రవిశంకర్ చేరిక సందర్భంగా గురువారం ఒంగోలులో పండుగ వాతావరణం నెలకొంది. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో రవిశంకర్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టారు. అనేకమంది రవిశంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలున్న రవిశంకర్ క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టటం ఇదే తొలిసారి. నగరంలోని అందరికీ సుపరచితులు కావటమే కాకుండా వ్యాపార, వాణిజ్య రంగం ద్వారా ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉఫాధి అవకాశాలు కల్పించటంతో పాటు సేవాభావం కలిగిన వ్యక్తిగా మంచి పేరుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన ప్రకాశం జల్లా రాజకీయాల్లో జనసేన పార్టీ తరపున కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కంది రవిశంకర్

 

advt
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *