ap news

రేపు ఢిల్లీకి సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 6,7 తేదీల్లో శ్రీకాకుళం, ఢిల్లీలో పర్యటించనున్నారు. 6న శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం సాయంత్రం 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఆ తరువాత సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈనెల 7న ఆదివారం ఉదయం 9.45 – 4.30 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించనున్న నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనమై రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *